నిజాయితీ చాటుకున్న హోటెల్ బ్యారర్ రామన్న…

పోగొట్టుకున్న బాధితుడికి 2500₹ అందిస్తున్న బ్యారర్

గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 28 (జనంసాక్షి):- హోటల్లో పనిచేస్తున్న రామన్న అనే బ్యారర్ తన నిజాయితీని చాటుకున్నాడు. హోటల్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం వనపర్తి నుండి పని నిమిత్తం గద్వాలకు వచ్చిన వినోద్ రెడ్డి అనే యూవకుడు గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ పరిధిలో ఉన్న సావిత్రి హోటల్ లో టిఫిన్ చేసి టిఫిన్ కౌంటర్ దగ్గర టిఫిన్ కు ఆ యువకుడు పైసలు ఇస్తూ అనుకోకుండా తన 2500 జేబు నుండి కింద పడిపోయాయి. ఆ యువకుడు చూసుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.ఆ డబ్బులను హోటల్లో పని చేస్తున్న బ్యారర్ లు చూసి కౌంటర్ లో ఉన్న యజమానికి ఇచ్చారు. ఎంత వెతికిన ఆ యువకుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు..నేడు(బుధవారం) మళ్ళీ టిఫిన్ చేయడానికి వచ్చిన యువకుడికి ఆ 2500 రూపాయలను ఆ యువకుడికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు.. దీనితో వనపర్తి యువకుడు హోటల్ యజమానికి మరియు బ్యారారులకు ధన్యవాదములు తెలియజేశాడు.