నిద్రిస్తున్న కూతుళ్లకు నిప్పంటించి… తండ్రి ఆత్మహత్య

5a8r3c6xఖమ్మం : పట్టణంలోని వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి… నిప్పంటించి… తాను నిప్పంటిచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్వర్ పాషా, పర్వీన్ లు దంపతులు. ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. రహీమా, రేష్మలు ఉన్నారు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. పర్వీన్ బక్రీద్ కు పుట్టింటికి తిరిగి వచ్చింది. అయితే ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది. పర్వీన్.. భర్త అన్వర్ పాషాపై పీఎస్ లో పిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో పోలీసులు నిన్న అన్వర్ పాషా ఇంటికి వచ్చి.. దర్యాప్తు చేసి.. వెళ్లారు. ఈక్రమంలో మళ్లీ ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ పాషా.. రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. తన ఇద్దరు కూతుళ్లు రహీమా, రేష్మలపై కిరోసిన్ పోసి… నిప్పంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో కూతురు రహీమా, తండ్రి అన్వర్‌పాషా మృతి చెందారు. మరో చిన్నారి రేష్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.