నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ అనుచరుడు శ్రీకృష్ణ చారి ని పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని మరెడుమాన్ దిన్నె గ్రామ సర్పంచ్ గన్నోజు సునిత భర్త,టిఆర్ఎస్ నాయకులు మరియు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు గన్నోజు శ్రీకృష్ణ చారి గత రెండు రోజుల క్రితం తమ నివాసంలో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీ కృష్ణ చారి ని పరామర్శిం చారు.వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత వైద్యులతో ఆడిగి తెలుసు కున్నారు.వీలైనంత త్వరగా కోలుకునే విధంగా చికిత్స అందించాలని వైద్యులకు జూపల్లి సూచించారు.ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించడం జరిగింది