నీతిఅయోగ్‌ సమీక్షలో తెలంగాణకు ప్రశంసలు

1A

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలపై నీతి ఆయోగ్‌ సభ్యులు పీజేఝా, ఏకే జైన్‌లు సవిూక్ష చేసి,. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులను అభినందించారు. ఇవి మంచి కార్యక్రమాలని, ప్రజలకు ఎంతోఒ మేలు చేసేవని అన్నారు.  యావత్‌ దేశాన్ని ఇవి ఆకర్షించాయని హైదరాబాద్‌లో జరిగిన సవిూక్షలో అన్నారు.  ఈ రెండు పథకాల లక్ష్యాలు, ప్రయోజనాలు, ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పథకాలు చేపట్టిందని కమిటీ సభ్యులు ప్రశంసించారు.  అన్ని రాష్ట్రాలు ఇలాంటి పథకాలు చేపట్టాలని కోరుతామన్నారు. నీతి ఆయోగ్‌ నుంచి మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని కోరినట్లు అధికారులు వెట్టడించారు. దీనికి నీతిఆయోగ్‌ సభ్యులు సానుకూలంగా స్పందించారు.  సీఎం కేసీఆర్‌ చేపట్టిన అన్ని పథకాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మిషన్‌కాకతీయ పథకాన్ని హైకోర్టు, నీతిఆయోగ్‌, కేంద్ర జలవనరుల శాఖతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారు. 245 టీఎంసీల నీటిని చెరువులలో నిలుపుకునేలా సీఎం కేసీఆర్‌ మిషన్‌కాకతీయను రూపొందించారని హరీశ్‌ తెలిపారు. ఇదిలావుంటే ఈ కార్యక్రమంలో అధికారులు బిపి ఆచార్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  మిషన్‌ కాకతీయ పై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు గుప్పించింది. తెలంగాణ ప్రజల జీవనాడి చెరువుల వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజా ఉద్యమంలా సాగిస్తున్న మిషన్‌ కాకతీయ. పనుల తీరుతెన్నులు కేంద్ర బృందాన్ని ఆశ్యర్యంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ అన్ని రాష్టాల్ర సీఎంలకు సూచించినట్లు ఢిల్లీ నుంచి వచ్చిన  నీతి ఆ యోగ్‌’ ప్రతినిధుల బృందం తెలిపింది. మిషన్కాకతీయ పథకానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు నీతి ఆయో గ్‌ బృందం తెలిపింది. మంగళవారం నాడు సచివాలయంలో మిషన్‌ కాకతీయ పై మూడు గంటలకు పైగా నీతి ఆ యోగ్‌ అధికారులు తెలంగాణ అధికారులతో సవిూక్షా సమావేశం జరిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ఎంతో దూర దృష్టితో ఇలాంటి పధకాలు చేపట్టడం సాహసోపేతమని వారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కి, కోస్తా ప్రయోజనాల కోసమే కార్య క్రమాలు అమలు చేశారని ప్రభుత్వ ప్రణాళా విభాగం సలహాదారు ఎ.కె.గోయల్‌ వివరించారు. గోయల్‌తో పాటు ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.కె. జోషి తెలంగాణ భౌగోళిక , వాతవరణ పరిస్థితులు వెనుకబాటుతనాన్ని వివరించారు. తెలంగాణ అభివృది కోసం నూతన పంథాలో విప్లవాత్మక కార్యక్రమలు చేపట్టినట్లు తెలిపారు. మిషన్‌ కాకతీయ పధకం ద్వారా చెరువులు పునరుద్ధరణ జరిగిన తర్వాత వాటి నిర్వహణ గురించి నీతి ఆయోగ్‌ అధికారులు వాకబు చేశారు. ‘చెరువు పరిరక్షణ కమిటీ ‘ పేరుతో ఆయా చెరువులపై ఆధారపడిన వివిధ సామాజిక తరగతుల వారితో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ  జోషి చెప్పారు. మిషన్‌ కాకతీయ కు తెలంగాణ ప్రభుత్వం 11,500 కోట్లు ఖర్చు చేస్తుండగా, నాబార్డు నుంచి 2 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఆర్‌.ఆర్‌.ఆర్‌ కింద 1500 కోట్లు ఇస్తోందని జోషి చెప్పారు. మూలా 5వేల కోట్లు కేంద్రం నుంచి సాయం అందించాలని జోషి, గోయల్‌ నీతి ఆయోగ్‌ బృందానికి విజ్ఞప్తి చేశారు. తమ వంతుగా ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెడతామని తప్పనిసరిగా సాయమందేలా ప్రయత్నస్తామని కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించినందున వాటినే ప్రాధాన్యత రంగాలు గా తీసుకొని ప్రభుత్వం రేయింబవళ్ళు పనిచేస్తున్నట్లు తెలంగాణ అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఇరిగేషన్‌ మంత్రి టి.హరీష్‌ రావు కృషిని ప్రస్తావించారు. మంత్రి హరీష్‌ రావు ప్రతినిత్యంపనులను స్వయంగా వ్యవేక్షిస్తున్నారని, వీడియో కాన్ఫరెన్సు, సమావేశాల ద్వారా పనులు వేగంగా, పారదర్శకంగా , అవినీతి రహితంగా జరిగేలా శ్రద్ధ చూపుతున్నారని ఇరిగేషన్‌ ఇంజనీర్లు నీతి ఆ

యోగ్‌ అధికారులకు వివరించారు. మిషన్‌ కాకతీయ పై ఇంతవరకు అవినీతి ఆరోపణలు రాకపోవడం వెనుక ప్రజల భాగస్వామ్యం కారణమని నీతి ఆయోగ్‌ బృందం అభిప్రాయపడింది. 3 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో? మిషన్‌  కాకతీయ పనుల పురో గతి, విజయగాధలపై మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌ రావు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్రావు ఓ, ఎస్‌.డి. శ్రీధర్రావు దేశ పాండే పవర్‌ పాయట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు . తెలంగాణ ఎందుకు వివక్షకు గురైందో, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలో ప్రభుత్వ సంహాదారు గోయిల్‌ వాదించిన తీరు కేంద్ర బృందాన్ని ఆకట్టుకున్నది. ఈ సమావేశంలో కేంద్మ ప్రతినిధులు జైన్‌, పి.కె. ఏఊం .తెలక్షగాణ ఎ/-లానింగ్‌ ప్రిన్‌ సి పల్‌ కార్యదర్శి బి.పి.ఆచార్య లోపాటు ఇరిగేషన్‌, ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమంపై నీతిఆయోగ్‌ సమగ్ర అధ్యయనం చేస్తోంది. కార్యక్రమాన్ని ఇప్పటికే అభినందించిన నీతిఆయోగ్‌ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. హైదరాబాద్‌ వచ్చిన నీతిఆయోగ్‌ సలహాదారు ఎస్‌.కె.జైన్‌… రాష్ట్ర ప్రణాళిక, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఏకే గోయల్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎంపి కవిత, మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. మిషన్‌ కాకతీయకు సంబంధించి అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ ప్రజలకు ఉపయోగకరమని ఇప్పటికే నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియ ఇప్పటికే  కితాబిచ్చారు.  మధ్యాహ్నం  మిషన్‌ కాకతీయపై సవిూక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మిషన్‌భగీరథపై నీతిఆయోగ్‌ ప్రతినిధులు సవిూక్షించనున్నారు.