నూతన రైతు కోఆర్డినేటర్ ని సన్మానించిన ఆత్మకూర్ నాగేష్.
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 10:(జనం సాక్షి): సదాశివ పేట
నూతన రైతు బంధు కోఆర్డినేటర్ పట్లోల అమరెందర్ రెడ్డి ని సంగారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆత్మకూర్ నాగేష్ సన్మానించారు. ఈ సందర్భంగా
ఆత్మకూర్ నాగేష్ మాట్లాడుతూ మా స్వగ్రామం ఆత్మకూర్ కి చెందిన సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ అమరెందర్ రెడ్డి కి ఈ పదవి దక్కడం ఎంతో ఆనందదాయకం అని, అతను గ్రామంలో ధనిక రైతు కూడా అవడం వల్ల మండలం లో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టికేఎస్ నాయకుడు కొరమని కృష్ణ , ముదిరాజ్, పిఏసిఎస్ డైరెక్టర్ మోతి సింగ్, జిల్లా బీసీ సంఘం నాయకుడు శ్రీశైలం యాదవ్, మండల ఎస్టీ సెల్ నాయకుడు దేవి సింగ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.