నెన్నెల ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ.

.పోటో: జాతీయజెండాకు వందనం చేస్తున్న ఉపాద్యాయులు, విద్యార్థులు.
నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా జాతీయజెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ మాట్లాడుతూ రాచరిక పాలన నుంచి విముక్తి చెంది ప్రజాస్వామ్యంలో విలీనం అయి 75 సంవత్సరం లోకి అడుగిడుతున్నందున ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాద్యాయురాలు వనజ, ఎమ్మార్పీ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.