నెమలికి త్రివర్ణ పతాకంతో అంత్యక్రియలు

– ఢిల్లీ పోలీసుల తీరుపై నేటిజన్ల ఆగ్రహం
– ఇది ప్రొటోకాల్‌ అంటున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, మే8(జ‌నం సాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు నిబంధనలు అతిక్రమించారు. సాధారణంగా యుద్ధాల్లో వీరమరణం పొందిన జవాన్లకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఢిల్లీకి చెందిన కొందరు పోలీసులు చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని హైకోర్టు పరిసరాల్లో గాయాలతో కన్పించిన ఓ నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది అప్పటికే చనిపోయి ఉండడంతో దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి చెక్క పెట్టలో ఉంచారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..’మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చాం. ఇది ప్రొటోకాల్‌. మున్ముందు ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.
నిపోయిన ఈ నెమలి షెడ్యూల్‌-1కు చెందిన పక్షి. అంటే 1972 వన్యసంరక్షణ చట్టం ప్రకారం ఈ పక్షి సంబంధించిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇలాంటి కోవకు చెందిన నెమళ్లు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అలాంటిది చనిపోయిన నెమలిని అటవీ శాఖకు అప్పగించకుండా పోలీసులే సొంతంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.