నేటినుండి 52వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

ఉత్సవ ఊరేగింపును విజయవంతం చేయాలి.
అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి.
ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాంచి పెద్ది శివకుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్25(జనంసాక్షి):
జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 52 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీతోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. భాగంగా ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ శివాలయం నుండి ఉత్సవ విగ్రహ ర్యాలీని ఆర్యవైశ్య పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. ఉదయం 8:30 గంటల నుండి ర్యాలీ ప్రారంభించి పట్టణ పురవీధుల గుండా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి పలు సంఘాల ఆర్యవైశ్య మహిళా యువజన సంఘాల సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా పూణే బ్యాండ్ బృందం చేత ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినిత్యం ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు విశేషంగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.