నేడు జరిగే జాబ్ మేళను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.

*నేడు జరిగే జాబ్ మేళను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి- శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి): నేడు జరిగే మెగా జాబ్ మేళాను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లిక కన్వెన్షన్ లో నిర్వహించే మెగా జాబ్ మేళాను రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతి యువకులు అంతా సద్వినియోగం చేసుకోవాలని శనివారం విలేకరుల సమావేశంలో శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి అన్నారు..
ఈ సందర్భంగా నిరుద్యోగ యువత కొరకు రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 80 కంపెనీలతో 7,000 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడానికి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసిందన్నారు. పదవ తరగతి పాస్ అయ్యి న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాలో పాల్గొని జాబు పొందవచ్చు అన్నారు. ఈ మెగా జాబ్ మేళా ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారని అన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.