నేడు బీసీసీఐ అత్యవసర సమావేశం

చెన్నై : బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం నేడు చెన్నైలో జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామా అంశంపైనే ప్రధానంగా కమిటీ చర్చించనుంది. వచ్చే శనివారం నిర్వహించాలనుకున్న ఈ సమావేశాన్ని తాజా ఘటనల నేపథ్యంలో ఆదివారమే నిర్వహించాలని నిర్ణయించారు. ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవికి రాజీవ్‌శుక్లా నిన్న రాజీనామా చేయడంతో శ్రీనివాసస్‌ రాజీనామాపై మరింత ఒత్తిడి పెరిగింది.