నేడు భారత్‌కు రానున్న భూటాన్‌ ప్రధాని

న్యూఢిలీ,జూలై4(జ‌నం సాక్షి ): భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే మూడు రోజుల పర్యటన సందర్భంగా గురువారం భారత్‌కు రానున్నారు. రక్షణ, భద్రత, వ్యూహాత్మక సహకారాలతో సహా పలు అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ చర్చలు రెండు దేశాల మధ్య స్నేహాపూర్వక సంబంధాలను బలోపేతం చేసేందుకు అవకాశాన్ని అందిస్తాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. భూటాన్‌ ప్రధాని టోబ్గేతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విస్తృతమైన చర్చలు జరపనున్నారు.