నేడే డిజిటల్ ఇండియా వారోత్సవం..

 ఢిల్లీ : డిజిటల్‌ ఇండియా వారోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. డిజిటల్‌ ఇండియా వారోత్సవానికి గౌరవ అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ హాజరుకానున్నారు. డిడి ఇండియా, డి న్యూస్ ఛానళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.