నేడే పి ఆర్ టి యు జిల్లా శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13( జనం సాక్షి);
పి ఆర్ టి యు జోగులాంబ గద్వాల జిల్లా శాఖ కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక డిఎస్పి కార్యాలయం ముందర ప్రారంభిస్తున్నట్లు పి ఆర్ టి యు జోగులాంబ జిల్లా అధ్యక్షులు తిమ్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి,
పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు హాజరవుతారన్నారు. గద్వాల శాసనసభ్యులు
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,
అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం.అబ్రహం,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత పాల్గొంటారన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు,మండల బాధ్యులు,జిల్లా,రాష్ట్ర బాధ్యులు,ప్రాథమిక సభ్యులు,సంఘ సీనియర్ నాయకులు,సంఘ మహిళా బాధ్యులు,ఉపాధ్యాయులు,రిటైర్డ్ సంఘ శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తిమ్మారెడ్డి తెలిపారు.