నేతాజీకి నరేంద్ర మోదీ నివాళి

aksha

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలను మోదీ కొనియాడారు. “ఆయన ధైర్యం, తెగింపు, దేశభక్తి మా హృదయాల్లో స్ఫూర్తిని నింపాయి. ఆయన పుట్టిన ఈ దేశంలో నేను  పుట్టినందుకు గర్వపడుతున్నాను. బోస్ నిర్వహణ, నాయకత్వ లక్షణాలు ఎంతో ఉత్తేజపూరితమైనవి. ఆయనొక ప్రత్యేకమైన వ్యక్తి ” అని మోదీ  తన సందేశాన్ని తెలియజేశారు.