నేనెప్పుడూ సీఎంను కాలేదు- ఫైళ్లపై సంతకం పెట్టలేదు:జగన్

ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు చేసిన స్కామ్ లపై కేంద్ర హోంమత్రికి నివేదిక ఇచ్చినట్లు వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… విభజన చట్టం హామీలు అమలు చేయాలని, ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. నేనెప్పుడూ సీఎంను కాలేదు- ఫైళ్లపై సంతకం పెట్టలేదు.. అలాంటప్పుడు నేనె అవినీతిపరుడిని ఎలా అంటారు అని ప్రశ్నించారు.