న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన

న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు

ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు చేసి, జైలులో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ వికలాంగులతో కలిసి శుక్రవారం నాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇంటి వైపునకు దూసుకువెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఫోర్జరీ సంతకాలతో ఖుర్షీద్‌ భార్య లూయీ ఖుర్షీద్‌కు చెందిన ఎన్జీఓ వికలాంగుల సొమ్మును స్వాహా చేశారని  కేజ్రీవాల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.  ఈ ఆరోపణల నేపథ్యంలో ఖుర్షీద్‌ దీనికి సంబంధించిన ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌తో కేజ్రీవాల్‌ ఈ ఆందోళనను చేపట్టారు. ఇదిలా ఉండగా, కేజ్రీవాల్‌ ప్రధానమంత్రి అపాయింట్‌ కోరగా ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. ఈ మేరకు కొన్ని రోజుల క్రితమే అపాయింట్‌మెంట్స్‌ ఫిక్సయి పోయాయని ప్రాధాన్యత క్రమంలో అపాయింట్‌మెంట్లను జారీ చేస్తామని పీఎంఓ వర్గాలు తెలియజేశాయి.