*పంచాయతీ కార్యాలయంలో ఘనంగా 75వ దినోత్సవ వేడుకలు.

– వరదల సమయంలో సేవలు చేసిన సెక్రటరీ సర్పంచులకు సన్మానం.*

బూర్గంపహాడ్ ఆగష్టు15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 75వ వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఇటీవల గోదావరి వరద ముంపుకు గురైన సమయంలో ప్రజలను వరద బారి నుండి పునరావాస కేంద్రాలు కు తరలించి వారికి భోజన వసతులు కల్పించడానికి సహకరించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ, ఐటిసి, ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రజా ప్రతినిధులు, విలేకరులు, పంచాయతీ సిబ్బంది, గ్రామప్రజలు సహకారంతో భోజన వసతులను వారికి సక్రమంగా అందేటట్లుగా వారికి ఏ లోటు రాకుండా వారికి రావలసిన భరోసాగా నిత్యవసర సరుకులు కల్పించే విధంగా వారికి సదుపాయాలు కలగజేసినందుకు స్థానిక పంచాయతీ సెక్రటరీ సమ్మయ్య, పంచాయతీ సర్పంచ్ సిరిపురపు స్వప్నకు, మొరంపల్లి బంజర సర్పంచ్ భూక్య దివ్యశ్రీ, జక్కిరెడ్డి మల్లారెడ్డి గార్లకు చిరు సన్మాన కార్యక్రమం చేసిన మండల కేంద్ర వాసులు.