పట్టాలు తప్పిన గూడ్సు రైలు
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో ప్రమాదవశాత్తూ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. డ్రైవర్ అప్పమత్తం కావడంతో పెనుప్రమాదం తపిపంది. ఈ గూడ్స్ రైలు విశాఖపట్నం నుంచి కరీంనగర్ వెళ్తోందరి అధికారులు తెలిపారు. ట్రైన్ క్రాసింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.