పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి

వనపర్తి జులై ఆగస్టు 1 (జనం సాక్షి) సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జె,రంజన్ రతన్ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ కోరు కానిస్టేబుల్ గోవింద్, మదనపూర్ కానిస్టేబుల్ కురుమయ్య గౌడ్,రేవల్లి కానిస్టేబుల్ రోశయ్య వివిధ పోలీస్టేషన్లలో కానిస్టేబుళ్లు గా విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతులు పొందిన ముగ్గురి కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుశాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు.పదోన్నతులు పొందిన పోలీసుసిబ్బంది, అధికారులు పోలీసుశాఖలో రెట్టింపుఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.జిల్లా పోలీసుశాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి డీఎస్పీ అనంద్ రెడ్డి ఉన్నారు.

ఇంచార్జ్ ఎస్పీ జె,రంజన్ రతన్ కుమార్