-పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

 

-అధ్యక్షులుగా కుకుడాల వెంకటస్వామి,
ప్రధాన కార్యదర్శిగా బోడ సురేందర్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ పట్టణంలో పద్మశాలి కుల పెద్దలు శనివారం శ్రీ సత్య సాయి ఆలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉప్పల లింగయ్య,గుజ్జరి నిరంజన్, బాస వెంకటేశ్వర్లు,నామని రామచంద్రయ్య సామల కొండయ్య సమక్షంలో నాగర్ కర్నూల్ పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పద్మశాలి సంఘం కార్యవర్గం:

అధ్యక్షులు: కుకుడాల వెంకటస్వామి.
ప్రధాన కార్యదర్శి: బోడ సురేందర్.
కోశాధికారి: మసున రామకృష్ణ.
గౌరవ అధ్యక్షులు: ఉప్పల లింగయ్య,
ఉపాధ్యక్షులు: పబ్బతి శ్రీనివాసులు,
జాయింట్ సెక్రటరీలు: మేడారం గంగాధర్,
మాకం రామాంజనేయులు,
కార్యవర్గ సభ్యులు: బోడ రామచంద్రయ్య, ఎల్ల మధుసూధన్.
ముఖ్య సలహాదారులు: గుజ్జరి నిరంజన్,
బాస వెంకటేశ్వర్లు,సామల కొండయ్య,
నామని రామచంద్రయ్య, క్యామశ్రీరాములు ను ఎన్నుకున్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అద్యక్ష, కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుల దైవమైన మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి జిల్లా కేంద్రంలో భూమిని కేటాయించాలని అడిగారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు.