పరిపాలన భవనానికి అంబేద్కర్ పేరు సముచిత నిర్ణయం అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి సెప్టెంబర్ 16 (జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర నూతన పరిపాలన భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టటం సముచిత నిర్ణయం స్వాగతిస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు అన్నారు శుక్రవారం వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడారు భవనానికి రాజ్యాంగ నిర్మాత ఆదర్శప్రాయుడు భారతరత్న అంబేద్కర్ పేరు పెట్టాలని స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి తీర్మానించడం హర్షనీయమన్నారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పరిపాలన భవనాలకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు దేశంలోని అత్యున్నత నూతన పార్లమెంట్ భవనానికి కూడా రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులు అందుకు కృషి చేయాలని కోరారు అఖిలపక్షం అవినీతిని ప్రశ్నిస్తుందని అభివృద్ధిని స్వాగతిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షులు వెంకటేష్ జయ రాములు మైనార్టీ ప్రెసిడెంట్ షఫీ కార్యదర్శి రమేష్ టౌన్ కార్యదర్శి భాస్కర్ అడ్వకేట్ ఆంజనేయులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారుటీ