*పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత:మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ*

పెబ్బేరు ఆగస్టు 7 ( జనంసాక్షి): పెబ్బేరు పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాకాలం లో సీసనల్ వ్యాదుల నివారణకు  ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయినాథ్ పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఫ్రైడే డ్రై డే  పట్టణంలోని ప్రతి వార్డు లలో స్పెషల్ ఆఫీసర్ లు,ఆర్ పి ల ద్వారా  వార్డు కౌన్సిలర్ ల సమక్షం లో బ్లీచింగ్, యాంటీ లర్వ స్ప్రే మరియు ఆయిల్ బాల్ లు వేయించడం జరిగిందని తెలిపారు. అందులో బాగంగా ప్రతి ఆదివారం జరుగుతున్న డ్రై లో ప్రజలందరు తమ వంతు బాధ్యత గా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామన్నారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ కర్రెస్వామి, మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్ , కౌన్సిలర్ వార్డ్ స్పెషల్ ఆఫీసర్ లు, ఆర్ పి లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.