పరిసరాల పరిశుభ్రత పై కట్కూర్ లో కళాజాత

బచ్చన్నపేట అక్టోబర్ 22 (జనం సాక్షి) మండలంలోని కటుకూరు గ్రామంలో శనివారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ ముసిని సునీత రాజు. ఎంపీపీ బి నాగజ్యోతి కృష్ణంరాజు మాట్లాడుతూ. మన శుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే అనారోగ్యాలతో నష్టపోతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలని అందులో భాగంగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పనులను కళాబృందాలచే వివరించడం జరుగుతుంది అన్నారు. కళాకారులు బానోతు గణేష్. పిన్నింటిరత్నం. బి చిరంజీవి. తిప్పర్తి శ్రీనివాస్. ముక్కెర సంపత్. పన్నీర్ శ్రీనివాస్. గడిపే బాలయ్య. కె మిడి రాజు. గెంటి హరిప్రసాద్. మూడవ సంజీవులు. ఎడవెల్లి విజయ. సల్ల చామంతి ఉన్నారు