పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్‌జేడీ

ఖ‌మ్మం : గార్లలో ఏర్పాటు చేసిన మూడు పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆర్‌జేడీ బాలయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వాహణ తీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. గార్లలో నిర్వహిస్తున్న మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 549 మంది విద్యార్థులు గణిత పేపర్‌-1 పరీక్షను రాశారు. ఆర్‌జేడీ వెంట ఎంఈవో రాంప్రసాద్‌ ఉన్నారు.