పరుమాల నాగరాజు లేకపోవడం పార్టీకి తీరని లోటు… -పరమాల నాగరాజు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని  కే.ఎస్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, స్వర్గీయులు పరుమాల నాగరాజు గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి పూలు వేసి నివాళులు అర్పించారు..అనంతరం ఆత్మ శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది..ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిచయం అవసరం లేని వ్యక్తి పరుమాల నాగరాజు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకొని నిజాయితీ గా పని చేశారని గుర్తుచేశారు.ప్రస్తుతం ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయనతో అనుభవ సంబంధాలు ఎల్లప్పుడూ మరువలేనిది. నాకు వ్యక్తిగతంగా నాగరాజు అన్నగారు అన్ని విధాలుగా సలహాలు సూచనలు అందజేస్తూ నా ఎమ్మెల్యే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో సాయశక్తులా నా గెలుపు కొరకు కృషి చేయడం జరిగిందని వెల్లడించారు.  పరుమాల  అభివృద్ధి కొరకు అహర్నిశలు పాటుపడిన వ్యక్తి నాగరాజు అన్న గారని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి వారి కుమారుడు వేణుగోపాల్ ముందుండాలని సూచించారు. పరుమాల నాగరాజు అన్న గారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.నాగరాజు అన్న ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉండి వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మండలం పార్టీ అధ్యక్షుడు రాముడు, తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, సీసాల వెంకట్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, నాగులు యాదవ్, కురుమన్న, గంట రమేష్, భగీరథ వంశీ, రిజ్వాన్, జగదీశ్వర్ రెడ్డి, పవన్ యాదవ్, పూడూరు చెన్నయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.