పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకున్ని ప్రతిష్టాపించడం అభినందనీయం.

అన్నం పరబ్రహ్మ స్వరూపం.
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రీక విజయలక్ష్మి వెంకటయ్య.
తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి) పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని ప్రతిష్టాపించి పూజించడం అభినందనీయమని మాజీ మున్సి పల్ చైర్ పర్సన్ కోట్రీక విజయలక్ష్మి వెంకటయ్య పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సీసీఐ కాలనీలో శ్రీలక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ప్రతిష్టా పించిన మట్టి వినాయకున్ని శనివారం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రీక విజయలక్ష్మి వెంకటయ్య ,మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ కలిసి మట్టి గణప య్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య మాట్లాడుతూ మట్టి బుజ్జ గణపయ్యను ప్రతిష్టాపించి పూజించడం సంతోషకరమని సీసీఐ కాలనీ ప్రజలను అభినందించారు.అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పేర్కొన్నారు.అన్నం పరబ్రహ్మ స్వరూపమని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సిసిఐ కాలనీ ప్రజలు, శ్రీలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు