.భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
` ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్
` మోడీ వ్యాఖ్యలతో యూ టర్న్
వాషింగ్టన్(జనంసాక్షి):భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే పాట పాడిన ట్రంప్ నాలుక మడతేశారు. తూచ్ నేను కాదంటూ ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత ప్రధాని మోదీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి మాట్లాడిన ట్రంప్.. ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేవిూ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ట్రంప్ విందు ఇచ్చిన అనంతరం ఓవల్ ఆఫీసులో వీరిద్దరూ విూడియా ముందుకువచ్చారు. ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్దాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్దానికి దారితీసేవే. ఆ రెండూ అణుశక్తి కలిగిన దేశాలు. అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు. అంతేగాక.. భారత్, పాకిస్థాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడిరచారు. భారత్, పాకిస్థాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేవిూ లేదని మోదీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకే ఫోన్లో చెప్పానని మోదీ తెలిపారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మోదీతో ఫోన్లో చర్చల అనంతరం కూడా ట్రంప్ తొలుత పాత పాటే పాడారు. ’మంచిది. నేను యుద్దాన్ని ఆపా. పాకిస్థాన్పై నాకు ప్రేమ ఉంది. మోదీ అత్యద్భుత వ్యక్తి అని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటలు గడవకముందే అమెరికా అధ్యక్షుడు దీనిపై వెనక్కి తగ్గడం గమనార్హం.
ముందు ఉక్రెయిన్తో మధ్యవర్తిత్వం చేసుకోండి..
` ఆ తర్వాత ఇరాన్ గరించి ఆలోచిద్దురుగానీ..
` పుతిన్పై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు
న్యూయార్క్(జనంసాక్షి):ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.పుతిన్ మధ్యవర్తిత్వ ప్రకటన గురించి ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను పుతిన్తో మాట్లాడినట్లు తెలిపారు. ‘నేను నిన్న పుతిన్తో మాట్లాడాను. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. నేను ఆయనతో ఇలా చెప్పాను. ‘’నాకు మీరు ఓ సాయం చేయండి. ఉక్రెయిన్తో జరుగుతున్న సంఘర్షణపై ముందు మధ్యవర్తిత్వం చేసుకోండి. ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దాం’’ అని తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చడంపై స్పందించేందుకు పుతిన్ నిరాకరించారు. ఈ అంశంపై తాను చర్చించాలనుకోవడం లేదని స్పష్టంచేశారు. అది తాను కోరుకోడం లేదన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి ఇరాన్ ఏమన్నా సాయం కోరిందా అని మరో ప్రశ్నకు పుతిన్ సమాధానమిచ్చారు. తమ స్నేహితులు ఇప్పటివరకు ఎలాంటి సాయం అడగలేదన్నారు. ఇదిలాఉండగా.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడంపై రష్యా ఉప విదేశాంగమంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ హెచ్చరికలు చేశారు. ఇజ్రాయెల్కు సైనిక సాయం చేయడం లేదా దాడుల్లో భాగం అయితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు.