పలు చోట్ల భూకంపం

ఏథెన్స్‌ : గ్రీక్‌ దక్షిణ తీరంలోని క్రెట్‌ దీవిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. నికరవాగులో కూడా భూప్రకంపనలు వ్యాపించాయి. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో

భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వెస్ట్‌కామెంగ్‌ జిల్లాలో కూడా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.7గా నమోదైంది.