పలు ప్రధాన ఆలయాల ఈవోల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల ఈవోలను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో జాయింట్‌ కమిషనర్‌, రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు వివిధ ఆలయాలకు  ఈవోలుగా ఉన్నారు.  13 మంది అధికారులు బదిలీ అయిన వారిలో  ఉన్నారు. వీరిలో కొందరని మాతృశాఖ అయిన రెవెన్యూ విభాగానికి రప్పించగా మరి కొందరిని ఇతర ఆలయాలకు ఈవోలుగా బదిలీ చేశారు.