పల్లె ప్రగతి పనులను పరిశీలించిన డిఆర్డిఓఉమాదేవి

మల్దకల్ జూన్ 7 (జనంసాక్షి) గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోనిమద్దెలబండ గ్రామ పంచాయతీలోని పల్లె ప్రగతి పనులను డి ఆర్ డి ఓ ఉమాదేవిసందర్శించి పరిశీలించారు.మంగళవారం గ్రామ పంచాయతీలో జరుగుతున్న పల్లె ప్రగతి కి సంబంధించిన పనులను పరిశీలించడం జరిగినది.బృహత్తర పల్లె ప్రకృతి వనం హరిత హారంలో మొక్కలు నాటడం కొరకు గుంతలు త్వరగా గుంతలు తీయాలని పంచాయతీ కార్యదర్శి సాంకేతిక సహాయకులను ఆదేశించడం జరిగింది.పెద్దతండ గ్రామ పంచాయతీలో బృహత్తర పల్లె ప్రకృతి వనం స్థలం పరిశీలించడం జరిగినది. గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాన్ని స్థలాన్ని పరిశీలించారు.పల్లె ప్రగతి కార్యక్రమం అయిపోయే లోపల అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.ఈమెవెంట ఎంపీడీవో జి కృష్ణయ్య ,ఎం పీ ఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ,ఏపీవో స్వామి,గ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ,పంచాయతీ కార్యదర్శు మారెప్ప,గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొనడం జరిగింది.