పవనే విడాకులు అడిగాడు
– తాను పెళ్లిచేసుకుంటే చంపుతామని కొందరు బెదిరించారు
– అందుకే భర్త ఎవరనేది ఇప్పటి వరకు చెప్పలేదు
– పెళ్లి జరిగాక అందరికీ చూపిస్తా
– సినీ నటి రేణూదేశాయ్
పూణెళి, జులై7(జనం సాక్షి) : పవన్ కళ్యాణ్ -రేణూదేశాయ్ల ఏడేళ్ళ దాంపత్యంలో అకీరా, ఆద్య అనే ఇద్దరు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వలన పవన్ నుండి విడిపోయిన రేణూ చాన్నాళ్లుగా పిల్లలతో పూణెళిలో ఒంటరిగా ఉంది. అయితే ఇటీవల తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. దీంతో కొందరు ఆమెని సోషల్ విూడియో వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వాటిని ప్రతిఘటిస్తూ ఘాటు రిప్లైలు ఇచ్చింది రేణూ. అయితే తాజాగా తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్నాళ్ళు ఒంటరిగా సాగిన ప్రయాణం, పడిన కష్టాలు, పవన్తో విడాకులు, రెండో భర్త గురించి చెప్పకపోవడం గల కారణాలని వివరించింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ నుండి విడిపోవడానికి కారణం చెప్పకపోయిన ముందుగా తానే విడాకులు అడిగాడని రేణూ వివరించింది. ఇన్నాళ్లు ఆ విషయంపై చెప్పకపోవడానికి కారణం, ఇంటి విషయాన్ని బయటపెట్టి రచ్చ చేయకూడదని. కాని ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న క్రమంలో అందరికి క్లారిటీ రావాలనే స్పందించినట్టు రేణూదేశాయ్ తెలిపింది. ఇక తనకి కాబోయే భర్తని పరిచయం చేయకపోవడానికి కారణం.. గతంలో పెళ్లి గురించి ప్రస్తావన తెస్తే, నన్ను, నాకు కాబోయే భర్తని చంపుతామని బెదిరించారని, అవి పట్టించుకోవద్దు అని చాలా మంది చెప్పిన అలా ఉండలేకపోయానన్నారు. కాబోయే భర్తకి హాని జరగకూడదని ఫోటోలు పెట్టలేదన్నారు. నేను చేసుకోబోయే భర్త చిత్ర పరిశ్రమకి సంబంధించిన వ్యక్తి కాదని, పెళ్లి తరువాత ఆయన ఎవరనేది తప్పక చెబుతానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.