పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన సభ్యులకు మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డ్స్ పంపిణీ

 వనపర్తి జిల్లా (జనం సాక్షి 27)వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ నందు శ్రీ పవన్ కళ్యాణ్  పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన సభ్యులకు మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా నాయకులు ముకుంద నాయుడు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా రక్త దానం చేసిన సభ్యులకు 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కృషి చేసిన యువశక్తి ఫౌండేషన్ సభ్యులకు సహకరించిన న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రక్త దానం వలన వారు ఆరోగ్యంగా ఉండటమే కాక మరో ముగ్గురి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని దేశంలో రక్త కొరత అధికంగా ఉన్నందున ఆరోగ్యవంతులు అందరూ రక్త దానం చేయుటకు ఆసక్తి చూపి ప్రాణదాతలుగా మారాలని పేర్కొన్నారు. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి  పవన్ కళ్యాణ్  చూపిన సేవా మార్గంలో నడుస్తూ ప్రజలకు అండగా వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు జిల్లా నాయకులు ముకుంద నాయుడు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ యూత్ సెక్రటరీ బాలకృష్ణ జనసేన సభ్యులు సురేష్ యాదవ్ , ఉత్తేజ్ , శేఖర్ గౌడ్, రమేష్, శివ, నరేష్, రామన్ గౌడ్ ,కార్తిక్, వెంకటేష్, రాఘవేందర్  న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు చంద్రశేఖర్, ఆదిత్య, యువ శక్తి ఫౌండేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ ఫౌండేషన్ సభ్యులు ఆంజనేయులు, మణికంఠ, మోహన్, వంశి, శివ తదితరులు పాల్గొన్నారు.