పశుపతినాథ్‌ ను దర్శించుకున్న ప్రధాని

ఖాట్మండ్‌,మే12(జ‌నం సాక్షి ):  నేపాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రముఖ ఆలయాలను సందర్శించారు. శనివారం ఖాట్మండులోని పశుపతినాథ్‌ టెంపుల్‌ను సందర్శించారు. ఐఏఎఫ్‌ చాపర్‌లో కఇక్కడికి మోదీ చేరుకున్నారు. ఇక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా టెంపుల్‌ను సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజిటర్స్‌ బుక్‌లో సంతకం పెట్టారు. టెంపుల్‌ అధికారులు పశుపతినాథ్‌ దేవాలయం ప్రతిమను మోదీకి బహుకరించారు. అనంతరం మోదీ  హయత్‌ రెజెన్సీకి పయనమయ్యారు. అక్కడ మోదీ.. నేపాలీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌, 
మాజీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌, మాజీ విదేశాంగ మంత్రి ఉపేంద్ర యాదవ్‌, రాష్టీయ్ర జనతా పార్టీ సభ్యులను కలవనున్నారు. 2016లో పశుపతినాథ్‌ టెంపుల్‌ను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి సందర్శించారు.