పాకిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు ..పదిమంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కరీచీ , క్వెట్టా, పెషావర్‌ ప్రాంతాల్లో చోటుచేసుకున్న నాలుగు పేలుళ్లలో 10 మంది మృతి చెందగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. కరాచీలోని ఏఎస్‌పీ ఎన్నికల కార్యాలయం సమీపంలో రెండు వరుస పేలుళ్ల చోటుచేసుకొని పది మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. పెషావర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలి పలువురికి తీవ్రగాయాలయ్యాయి.