పాకిస్థాన్‌లో భూకంపం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఇవాళ ఉదయం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.9గా నమోదైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర, మధ్య పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి, పెషావర్‌,లాహోర్‌తో సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంపంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గాయపడినట్టు సమాచారం. కాగా ,జమ్ము ,కశ్మీర్‌లోను ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది