పాక్‌లో బాంబు పేలుడు : ఏడుగురి మృతి

పాకిస్తాన్‌ : వాయువ్య పాకిస్తాన్‌ కైబర్‌ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. కైబర్‌ ప్రావిన్స్‌లోని డాబన్‌వాలా ప్రాంతంలో షియా తెగకు చెందిన ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు లక్ష్యంగా చేసుకొని రోడ్డుకు సమీపంలో ఉంచిన బాంబును రిమోట్‌ ద్వారా పేల్చారు. ఈ బాంబు పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు ఇంకా ఏ తీవ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం రావల్పిండి నుంచి షియట్‌ వరకు ముస్లింలు జరిగిన ఊరేగింపులో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆత్మాహుతి దళాలు జరిపిన ఈ దాడిలో 23 మంది మృతిచెందారు. ఇంకా 62 మంది తీవ్రంగా గాయపడ్డారు.