పాక్‌లో సీనియర్‌ న్యాయవాది కాల్చివేత

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో 26/11 ముంబయి దాడుల కేసు, బెనజీర్‌ భుట్టో హత్య కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాదిని దుండగులు ఇస్లామాబాద్‌లో ఈ ఉదయం కాల్చిచంపారు. కారులో వస్తున్న న్యాయవాది జుల్ఫీజర్‌ అలీపై ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో న్యాయవాది అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో న్యాయవాది భద్రతాసిబ్బందికి గాయాలయ్యాయి.