పాటిమట్లలో ఘనంగా పీర్ల పండుగ

మోత్కూరు ఆగస్టు 7 జనంసాక్షి : మండలంలోని పాటిమట్ల గ్రామంలో ఆదివారం మొహరం పండుగ పురస్కరించుకొని పీర్ల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మి నరసింహ రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండి సోదర భావంతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో ముజవరి షేక్ జాహంగీర్ ,సర్పంచ్ మల్లేష్, అయుబ్ ఖాన్,గ్రామ ప్రజలు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.