పాన్‌కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

దిల్లీ(జ‌నం సాక్షి): పాన్‌కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరోసారి పెంచింది. జూన్‌ 30తో ముగిసిపోయిన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 2017లో జులై 31, ఆగస్టు 31, డిసెంబరు 31; 2018లో మార్చి 31, జూన్‌ 30 వరకు తుదిగడువు అంటూ ఇప్పటికే ఐదుసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద దాఖలైన పలు వ్యాజ్యాలు.. పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సీబీడీటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.