పాముకాటుతో మృతిచెందిన మహిళ

పరిగి, జనంసాక్షి: మండలంలోని రంగంపల్లి గ్రామంలో ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మంగమ్మ(32) అనే మహిళ ఆరుబయట నిద్రిస్తుండగా పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.