పామునూర్ గ్రామంలో కార్డెన్ అండ్ సర్చ్

10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 29, (జనం సాక్షి ) :
మండలంలోని పామునూర్ గ్రామంలో  స్టేషన్ ఘన్పూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్  అండ్ సర్చ్ నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో భాగంగా  సరైన పత్రాలు లేనటువంటి 10వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింద ని ఏసీపీ రఘు చందర్ అన్నారు. పాంనూర్ లో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీపీ రఘు చందర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా లైసె న్స్,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డుపై వెళ్తున్నప్పుడు విధిగా హెల్మె ట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలు మీయొక్క ఓటిపి నంబర్లు ఎవ్వరికి కూడా చెప్పవద్దని,ఏ బ్యాంక్ వాళ్ళు కూడా పిన్ నంబర్లు చెప్పమని అడగరని అన్నారు. సోషల్ మీడియా లో  మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని
ముఖ్యంగా ఫోర్ జి అనగా గంజాయి, గుడుంబా గ్యాంబ్లింగ్ గుట్కా లాంటి చెడు వ్యసనాలకు బాని స కావద్దని అన్నారు. యువత గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి విలువైన జీవి తాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని,తల్లి దండ్రులు  వారిని గమనించాలని కోరారు. ఊరికి చివరన ఇండ్లు కలిగినవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఏదైనా శుభకార్యాలకు,దూర ప్రయాణ లు చేయదలచిన వారు మీయొక్క విలువైన వస్తు వులను జాగ్రత్త పరుచుకుని వెళ్లవలసిందిగా తెలి పారు. ఈ కార్యక్రమంలో  స్టేషన్ ఘనపూర్ సీఐ  ఆలే రాఘవేందర్,జనగామ రూరల్ సీఐ సంతోష్, స్టేషన్ ఘనపూర్ ఎస్సై  శ్రవణ్ కుమార్, చిల్పూర్ ఎస్ఐ రాజు,లింగాల ఘనపూర్ ఎస్ఐ రఘుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.