పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో మృత్యువాత చెందిన కార్మిక కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.

తెలంగాణ జాగృతి అచ్చంపేట నియోజకవర్గ నాయకులు చారకొండ సత్యం
అచ్చంపేట ఆర్ సి 29 జూలై జనం సాక్షి న్యూస్ స్థానిక అచ్చంపేట జిల్లాలోని కొల్లాపూర్ వద్ద అర్ధరాత్రి సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో  దుర్మరణం చెందిన ఘటనపై   తెలంగాణ జాగృతి నియోజకవర్గ నాయకులు చారగొండ సత్యం  స్పందిస్తూ…. ఆయన  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులో భాగంగా కొల్లాపూర్ మండలం ఉదయం రేగమనగడ్డ  వద్ద జరిగిన ప్రమాదంలో క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు మరణించగా ఒకరికి తీవ్ర  గాయపడగా వెంటనే  సమీపంలోని ఆసుపత్రికి  తరలించి చికిత్స అందిస్తున్నారని, మిగతా ఐదుగురి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతులను బీహార్  రాష్ట్రానికి చెందిన కార్మికులు గా గుర్తించారని తెలిపారు.ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని వెంటనే రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వం , బీహార్ ప్రభుత్వాలు స్పందించి  మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు  ఆర్థిక సహాయం చేసి వారి  ఆదుకోవాలని కోరారు. ఈ సంఘటనపై  కార్మిక శాఖ మా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
Attachments area