పాలెం వెంకన్న ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు.

బిజినపల్లి,సెప్టెంబర్26(జనంసాక్షి):
బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామం లోగల శ్రీ అలివేలు మంగ సమెత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు తొలిరోజు పూజలందుకున్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి తొలి రోజు పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు అధికంగా పాల్గొనడం జరిగింది యూత్ సభ్యులు ఆనంద్,ప్రమోద్,వెంకటేష్ మోహన్,అల్లోజి,వినయ్,అభి, ఆలయ అర్చకులు జయంత్, శుక్ల ,చక్రపాణి సిబ్బంది శివకుమార్ , బాబు, భక్తులు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.