పిఎసిఎస్ మార్ట్ కు భూమి పూజ

వెంకటాపూర్  (రామప్ప) జనం సాక్షి : మండల కేంద్రంలోని పి.ఎ.సి.ఎస్ మార్ట్ కు  సోమవారం సర్పంచ్ మెడబోయిన అశోక్ భూమి పూజ చేశారు. పిఎసిఎస్ చైర్మన్ కాసర్ల కుమారస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మార్ట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేవలం వ్యవసాయ రుణాలకు, రైతులకు అవసరమైన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచుకునేందుకు గోదాం లాంటివి కాకుండా త్వరలోనే ప్రజలకు అన్ని విధాల తోడ్పాటు అందించేందుకు మార్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులో కొనుగోలు చేసిన ధరలకే ఇక్కడ కూడా సరుకులు లభిస్తాయని అన్నారు. రూ. కోటితో  చేపట్టే భవనాలు కార్యాలయానికి, గోదాంకు, మార్ట్ కు ఉపయోగపడేలా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్  వీరమనేనిసీతారామరావు, డైరెక్టర్లు పంబిడి మహేందర్ రావు, అల్లేపు రాజమొగిళి, రామిండ్ల రాజేందర్, కొప్పుల ఆయిలు కొంరు, బోయిని రజిత, ఇటికాల రాధమ్మ, మందల ప్రభు రెడ్డి, మందల వెంకటరమణారెడ్డి , రమేష్, బానోత్ సంపత్, పోతరవేని రేణుక, ఎంపీటీసీలు జంగిలి శ్రీలత, పోశాల అనిత, సిబ్బంది పోలు దాసరి శ్రీకాంత్, అజ్మీర రమేష్, యాట లింగయ్య, పల్నాటి మల్లికాంబ తదితరులు ఉన్నారు.