పిడిఎస్ యు జిల్లా 13వ మహాసభను జయప్రదం చేయండి..

నిర్మల్ బ్యూరో, నవంబర్10,జనంసాక్షి,,,  ఈ నెల 25న జరగబోయే నిర్మల్ జిల్లా 13వ మహ సభను జయప్రదం చేయాలని, పిలుపనిస్తు మహాసభ కరపత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విడుదల చేశారు.. ఈ సందర్భగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శింగరి వెంకటేష్, వాగ్మరే మహేందర్ లు మాట్లాడుతూ .  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవిలంబిస్తున్నాయి .  ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేయకుండా కాలయాపన చేస్తుందని.  గురుకులాలకు పక్క భవనాలు నియమించా కుండా అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు దినీవలన విద్యార్థులు  తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి తక్షణమే పక్క భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అదేవిధంగా జిల్లాకు గిరిజన  విశ్వవిద్యాలయం ఏర్పాటు చెయ్యాలి .జిల్లాకు  ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు . ఈ నెల 25వ తేదీ రోజున జరిగే జిల్లా మహాసభ లో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో  PDSU నాయకులు విశాల్, కిరణ్, ప్రభూ తదితరులు పాల్గొన్నారు.