పిడుగుపాటు ఘటనలపై వెంకయ్య దిగ్భాంతి

న్యూఢిల్లీ,మే14(జ‌నం సాక్షి):  దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, పిడుగుపాటు మృతుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో పిడుగుపాటుకు మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉపరాష్ట్రపతి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.