పీజీ ఎంట్రన్స్ లో మెరిసిన ఆణిముత్యం

మల్దకల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి)
పాఠశాల స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి ఇటీవల నిర్వహించిన పీజీ గణితం ఎంట్రెన్స్ పరీక్షలలో యూనివర్సిటీ స్థాయిలో 19వ ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన దామ ఓబులేష్, శారదమ్మ కూతురు అయిన వినూత్న ఇటీవల జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ గణితం ఎంట్రన్స్ పరీక్షలలో 19వ ర్యాంకు సాధించడం పట్ల తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
Attachments area