పులిచింతల నిర్వాసితుల పరిహారానికి కమిటీ ఏర్పటైన చెసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారానికి సంబంధించి నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వేమవరంలోని 174 కుటుంబాల పరిహారానికి ఈ కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, పులిచింతల ప్రత్యేక కలెక్టర్‌, ఎస్‌ఈ , వాలంటరీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.