పుస్తకాలు , పెన్నుల పంపిణి హర్షణీయం – పన్నాల నాచారం

(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని వాకింగ్ డీర్స్ వాకర్స్ ఆధ్వర్యంలో మల్లాపూర్ జిల్లా ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులను పంపిణి చేసారు. ఇట్టి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అతిధిగా విచ్చేసి పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వినూతనంగా కార్యక్రమాన్ని రూపొందించిన వాకింగ్ డీర్స్ సభ్యులందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు దేవేందర్ రెడ్డి.
కార్యక్రమంలో వాకింగ్ డీర్స్ సభ్యులు , జెడ్పీహెచ్ఎస్  ప్రధానోపాధ్యాయులు నెల్సన్ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Attachments area