పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / ఆదివారం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో 1991-92 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాల ఆవరణలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని పూర్వ స్నేహితులను ఉత్సాహంగా కలుసుకొని వారికి బోధించిన ఉపాధ్యాయులను సన్మానించుకున్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో 91-92 బ్యాచ్ తరుపున చదువుకున్న పాఠశాలకు లక్ష రూపాయల విలువైన టెంట్,డెకరేషన్ మెటీరియల్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు,స్థానిక సర్పంచ్ దార్ల రామ్మూర్తి, ప్రస్తుత ఉపాధ్యాయులు,91-92 పదవతరగతి విద్యార్థులు ఎస్కె. హుస్సేన్,ఎస్కె. హిమామ్, పులెందర్,శంకర్,వై.సోమయ్య,మంజుల,సుకన్య,పుష్ప,లక్ష్మీ,డి.వెంకన్న,బి.ఉప్పలయ్య,సతీష్,యాకన్న,లక్ష్మయ్య జనార్ధన్,శ్రీరాములు,నాగన్న,వెంకన్న,రంగన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.